"ఒరేయ్ రాజుా! నీకీ విషయం
తెలీదేంట్రా! గోశాల జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందట. మీ చిన్నాన్న కొడుకు
లేడుా.. అదేరా మీ శీనుగాడు. వాణ్ని పోలీస్ జీపు గుద్దేసిందంట. పాపం ఎలా ఉన్నాడో
ఏమో?" గోసాల కేసి పరిగెడుతున్నాడు ఈరన్న. నాకు నోట మాట రాలేదు. ఆత్రుతగా అతని
వెనుకే పరుగందుకున్నాను. గోశాల మూడు రోడ్ల జంక్షన్. మధ్యలో పెద్ద రావి చెట్టు.
అప్పటికే అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు. మీ వెళ్లేసరికి శ్రీను గాణ్న
పెద్దఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. "ఏమైందిరా?" జనాల మధ్య ఏడుస్తూ
నిలబడ్డ నర్సింహన్ని చూసి అడిగాను. " ఏమో అన్నయ్యా! ఇంటిదగ్గర
బయలుదేరినప్పుడు శ్రీనివాస్ నగర్ వెళ్ళొస్తా అన్నాడు. సైకిల్ తీస్తుంటే వద్దని
తిట్టాడు నాన్న. అయినా వినకుండా వచ్చాడు. ఇదిగో ఇప్పుడిలా!" ఏడుస్తున్న
అన్నాడు నర్సింహ. " ప్రాణహాని లేదు కదా! ఆత్రుాతగా అడిగాడు. " ఏమో!
చూసినవాళ్లంతా స్పాట్ లోనే చనిపోయాడంటున్నారు. ప్రమాదం జరిగి జరగ్గానే పోలీసులు
అదే జీపులో పెద్ద ఆసుపత్రికి తీసుకు పోయారట. నేను ఇప్పుడే వచ్చాను" చెప్పాడు
నర్సింహ. గంట గంటన్నరలో పే అనుకుంటూ అంబులెన్సు ఒకటి సైరన్ వేసుకుంటూ వచ్చింది.
దాన్ని చూస్తూనే మా అందరికీ దుఃఖం ఆగలేదు. దాని వెనుకే పోలీసు జీపు కూడా ఫాలో అయి
వచ్చింది. శీనుగాడి శవాన్ని అప్పగించేసి వెంటనే వెళ్లిపోయారు పోలీసులు. అప్పటికే
సాయంత్రం ఆరైపోయింది. చీకటి ముదురుతుంది. నాకెందుకో మనసంతా ఆందోళనగా ఉంది. మనసు
మనసులో లేదు. ఆలోచిస్తూ నడుస్తున్నాను. 'పోలీసులే గుద్దేసి,కేసు గీసు లేకుండా మాఫీ
చేసేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. తెల్లారితే
శ్రీను శవాన్ని దహనం చేస్తారు. ఈలోపే ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి? ఎస్! పేపర్
వాళ్లకి ఈ విషయం చెబితేనే, బయట ప్రపంచానికి తెలుస్తోంది. పేపర్ ఆఫీస్ కు ఫోన్ చేశాను.
" సార్! మాది అడవివరం గ్రామం. మా ఊళ్లో ఒక కుర్రాన్ని పోలీస్ గుద్దేసింది. ఆ
కుర్రాడు చనిపోయాడు" నెమ్మదిగా నరుగుతూ విషయం చెప్పాడు. అరగంటలో వచ్చి
వాలిపోయాడతను. అతను టీవీ రిపోర్టర్లు, పేపర్ రిపోర్టర్లు అందరికీ
ఉప్పందించినటున్నాడు. పది పదిహేను మంది మూకుమ్మడి దాడి చేశారు. రాత్రి ఎనిమిది
గంటల వార్తల్లో అన్ని టీవీ ఛానల్లో ఇదే వార్త. సరిగ్గా అర్ధరాత్రి నాలుగైదు
జీపుల్లో పోలీసులు వచ్చారు. బంధువులంతా శోకసంద్రంలో మునిగి ఉన్నారు. పోలీసుల
హడావిడి చూసి ఊరంతా ఉలిక్కిపడిలేచింది. మా వాళ్ళెవరూ ఇళ్లకు కూడా వెళ్లలేదు. నేను మూల
నక్కి నిలబడ్డాను." ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి ప్రెస్ వాళ్లకి ఎవరు
లీక్ చేశారు? ఇది సాధారణ ప్రమాదమే కదా. ఇప్పుడు చూడండి. ఈ కేసు తలనొప్పి లా
తయారైంది." అని ఓ పోలీసు అధికారి పబ్లిక్ మీద అరుస్తున్నాడు. అలా అంటూనే
శ్రీను శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం పెద్దాస్పత్రికి
తీసుకెళ్ళమని ఆర్డర్ జారీ చేశాడు. నేను అనుకున్నట్లే పోలీస్ కేసు నమోదయింది. ఆ
మర్నాడు పోస్ట్ మార్టం జరిగాక శవాన్ని అప్పగించేశారు. దహనసంస్కారాలు అయ్యాక అందరం
బజార్లో రావి చెట్టు కింద కూర్చున్నాం. గోపాలపట్నం నుంచి బుల్లెట్ మీద ఎస్సై, ఒక
కానిస్టేబుల్ వచ్చారు. " ఇక్కడ నరేంద్ర ఎవరు?" బుల్లెట్ దిగుతూనే
కానిస్టేబుల్ మా దగ్గరకు వచ్చి అడిగాడు. పోలీసులు నా గురించి అడిగేసరికి
ఉలిక్కిపడ్డాను. నాకెందుకు ఒళ్ళు వణకసాగింది. మనసులో ఏదో భయం మొదలైంది. వినయంగా
వెళ్లి ఎస్సై గారికి నమస్కారం చేశాను. " మీరే కదా.. పేపర్ వాళ్ళకి ఈ
యాక్సిడెంట్ మెసేజ్ చెప్పింది" నాకేసి చూస్తూ అడిగాడు. అదిరిపడ్డాను. నా
పేరు, వివరాలు పోలీసులకు ఎలా తెలుసాయి.?" " ఓకే నరేంద్ర. నేను క్రైమ్
బ్రాంచ్ నుంచి వచ్చాను. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. డోంట్ వర్రీ. మీరు చేసింది
మంచి పని. తప్పు కాదు. వర్రీ కాకండి" అన్నాడు ఎస్సై. అతనలా అనేసరికి నా మనసు
కాస్త కుదుటపడింది. " సార్! యాక్సిడెంట్ జరిగిన విషయమే తెలుసు. అదే పేపర్
వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను" వినయంగా అన్నాడు. " మీ ఫోన్ నెంబర్ ఇదే
కదా, అవసరమైనప్పుడు మీకు కాల్ చేస్తాను. దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు ఇది
పబ్లిక్ ఇంట్రెస్ట్ కేస్" చెప్పాడు ఎస్సై. నాకేమీ అర్థంకాక అయోమయంగా
చూశాను." పేపర్లో వార్త చూసి ఎవరో లాయర్ గారు ప్రజావాజ్యం వేశారు. పోలీస్
జీప్ యాక్సిడెంట్ కి సంబంధించి బాధితులకి అన్యాయం జరగకుండా న్యాయవిచారణ
జరిపించాలని కోర్టును కోరాడు. దాంతో కోర్టు నాకి ఎంక్వయిరీ బాధ్యతలు అప్పగించింది.
మీరు ఫోన్ చేసిన పేపర్ ఆఫీసులో మీ ఫోన్ నెంబర్ తీసుకుని మీ వివరాలు సేకరించి
ఇక్కడకు వచ్చాను. మీకు ఎలాంటి వివరాలు తెలిసిన నాకు ఫోన్ చేయండి." అంటూ ఉన్న
విజిటింగ్ కార్డును నాకిచ్చాడు ఆ ఎస్సై. " అలాగే సార్" అన్నాను
సంతోషంగా. ఒక పోలీస్ ఆఫీసర్ నాకెంత వివరంగా కేసు గురించి చెబుతున్నప్పుడు ఇక
నాకెందుకు భయం అనుకున్నాను. " మేం యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళాం. అక్కడ
చలివేంద్రం ఉంది కదా. ఆ కుర్రాడే ప్రత్యేక సాక్షి. ఇంకా ఎవరైనా యాక్సిడెంట్
జరిగినప్పుడు అక్కడున్నారేమో ఆరా తీయండి నరేంద్ర" అడిగాడు ఎస్సై. " కేసు
రిజిస్టర్ అయిందిగా. రావలసిన రాయితీలు, ఇన్సూరెన్స్లు గట్రా అన్ని వస్తాయి.
కాకపోతే ఈ ప్రమాదం పోలీసుల నిర్లక్ష్యమా? లేక నిజంగా యాక్సిడెంటా? అనేది తేలాలి.
ఓకే థాంక్యూ నరేంద్ర.." ఎస్సై స్టార్ట్ చేశాడు. అతని వెనుక ఎక్కి కూర్చున్నాడు
కానిస్టేబుల్. పోలీసులు వెళ్లిపోయాక బజారులో ఉన్న వాళ్లంతా వచ్చి నన్ను
చుట్టుముట్టారు. " ఆరోజు పోలీసులు కొండకి వెళ్లి వస్తుండగా ప్రమాదం
జరిగిందంటున్నారట్రా. ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండ్రా. ఎస్సైగారికి సమాచారం
ఇవ్వచ్చు" అన్నాడు ఆలోచిస్తూ. " ఒరేయ్ నరేంద్ర! ఆరోజు ఆ పోలీసోళ్లు
గోపాలపట్నం నుంచి వస్తూ నా దుకాణం దగ్గర ఆగి సిగిరెట్టు కొనుక్కున్నార్రా. అప్పుడు
మన శీనుగాడు ఈ జీపు డ్రైవర్ తో ఏదో మాట్లాడ్డం చూశాను" అన్నాడు కిళ్ళీకొట్టు
కన్నయ్య. ఆ మాట వింటూనే ఉలిక్కిపడ్డాను. పోలీస్ జీపు డ్రైవర్ తో శ్రీనుగాడికి పనేంటి?
జీపు డ్రైవర్ తో మాట్లాడేంత చనువుందా? ఇంతకీ ఏం మాట్లాడుంటాడు? ఆలోచిస్తూ
ఉండిపోయాను. " శ్రీనుగాడి తో మరో కుర్రాడు కూడా ఉన్నాడ్రా!" ఆలోచిస్తూ
అన్నాడు కిళ్ళీకొట్టు కన్నయ్య. " నిజమా! ఎవరా కుర్రాడు?" ఆత్రుతగా
అడిగాడు. ఈ సమాచారం క్రైమ్ బ్రాంచ్ ఎస్సైకి చేరవేయాలి. దీనివల్ల విసమెత్తైనా
కేసుకు మేలు జరుగుతుంది ఏమో! అనుకున్నాడు. " మన ఊరోడో.. పక్కుారోడో.. ఆ
కుర్రాడు సరిగా పోలిక దొరకలేదురా?" తల గోక్కుంటూ విచారంగా అన్నాడు కన్నయ్య. ఆ
వెంటనే వీళ్లు చెప్పిందంతా ఎస్సైకి పూసగుచ్చినట్లుగా చెప్పేశాను. " వెల్ డన్
నరేంద్ర. ఆ కుర్రాడేవరో ఆరా తీయ్యి. నేను ఎంటరైతే భయపడి ఎవరు నిజం చెప్పారు."
అన్నాడు ఎస్సై. " అలాగే సార్!" అన్నాను ఉత్సాహంగా. ఆ రోజే శ్రీను
చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాను. కాలేజీకి వెళ్లి శ్రీను తో చనువుగా ఉండేవాడి
స్నేహితుల జాబితా సంపాదించాను. శ్రీను పెద్దఖర్మ రోజు వాడి స్నేహితులందరినీ
పిలవాలని అనుకుంటున్నామని అబద్ధమాడితే గాని ఒకరొకరు బయటపడలేదు. పది మంది వరకు
ఉన్నారు. " అన్నా! శ్రీను చాలా మంచోడన్నా. ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.
ఎవరన్నా గొడవపడితే ఇద్దరికీ రాజిచేసి దోస్తి చేసేవాడు. చదువులో కూడా సూపర్
బ్రిలియంటన్నా" దాదాపుగా అందరూ శ్రీను గురించి మంచి మాటలే చెబుతున్నారు.
" అన్నా! రాజీవ్ గాడోక్కడున్నాడు. ఆడు రెండు రోజులుగా కాలేజీకి రావడం లేదు.
వాడు మా అందరికన్నా శ్రీనుగాడికి జిగురు దోస్తన్నా వాణ్ని కూడా తీసుకోస్తాం."
ఓ కుర్రాడు నేను వచ్చేయబోతుంటే పరుగున నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒక్కసారిగా నాలో
ఉత్సాహం పెరిగింది. ఆరోజు శ్రీనుగాడితో ఉన్నది ఆ కుర్రాడే కావచ్చు. " ఆ
అబ్బాయిది ఏ ఊరు?" అడిగాను. " అడివివరం దగ్గర విజినిగిరి పాలెం".
వెంటనే నేరుగా విజినిగిరి పాలెం వెళ్లాను. రెండు రోజులుగా జ్వరంగా ఉందని కాలేజీకి
వెళ్లలేదని చెప్పాడు రాజీవ్. " శ్రీను కి యాక్సిడెంట్ జరిగిన రోజు ఉదయాన్నే
నువ్వు, శ్రీను కలుసుకున్నారు కాదుా?" అనడిగా. " ఆ.. ఆ.. అవునన్నా"
తడబడుతూ చెప్పాడు." ఎక్కడ? కలుసుకున్నాక ఏం జరిగింది?" " అడవివరం
మెయిన్ రోడ్డుమీద. ఆరోజు మాకు కాలేజీ లేదు. ఊరికే కలుద్దామని వెళ్ళాను. మేమిద్దరం
మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్డు వారగా నడుస్తూ వెళ్తున్నాం. ఇంతలో పోలీస్ జీప్ వచ్చి
పాన్ షాప్ ముందు ఆగింది. జీపు నుంచే ఇద్దరం ముందుకు వెళ్తున్నాం. ఇంతలో పోలీసు
జీపులో కూర్చున్న డ్రైవర్ మమ్మల్ని పిలిచాడు. ఎందుకు అనుకుని ఆగాం. జీపు దగ్గరకు
రమ్మన్నాడు. వెళ్ళాం. ఏం కళ్లు కనబడడం లేదా? పోలీసు జీపు తెలిసి ఒళ్ళు దగ్గర
పెట్టుకుని నడవలేరా? అని కోపంగా అన్నాడు జీపు డ్రైవర్. మేమేం చేశామని శ్రీను ఎదురు
ప్రశ్న వేశాడు. 'జీపు మీద ఎవర్రా బాదింది?' కళ్ళు ఎర్ర చేస్తూ అన్నాడు.
'మాట్లాడుకుంటూ వెళ్తూ నేనే జీపు మీద నెమ్మదిగా దరువు వేశాను. గట్టిగా బాద లేదు
సార్..' అన్నాన్నేను భయపడుతూ. 'వేస్తార్రా వేస్తారు. కాలో చెయ్యో తీసేస్తే ఆ పొగరు
వగరు వదిలిపోతుంది' అన్నాడతను కోపంగా.' పదరా!' అంటూ శ్రీనే అతన్ని పట్టించుకోకుండా
అక్కడినుంచి నన్ను లాక్కొచ్చేశాడు. ఆ డ్రైవర్ వెనుకనుంచి బూతులు తిడుతున్నా పట్టించుకోకుండా
వచ్చాం. అంతే అన్నా జరిగింది. ఆ మధ్యాహ్నమే శ్రీను కి యాక్సిడెంట్ జరిగిందని
తెలిసిందన్నా. అప్పటి నుంచి నాకి మాయదారి జ్వరం తగులుకుంది" అన్నాడు రాజీవ్
ఆరోజు జరిగిందంతా క్రైమ్ బ్రాంచ్ ఎస్సైకి ఫోన్ చేసి చెప్పాను. ఆ జీపు డ్రైవర్
కానిస్టేబుల్ కాదని, హోంగార్డు అని చెప్పాడు. నన్ను పోలీస్ స్టేషన్ కి చి
కలవమన్నాడు. వెంటనే వెళ్ళి కలిశా. నేను వెళ్ళగానే కానిస్టేబుల్ కి చెప్పి జీపు
డ్రైవర్ హోంగార్డునీ వెంట పెట్టుకుని పిలిపించారు. " నువ్వు ఈరోజు ఉదయం మొన్న
యాక్సిడెంట్ లో చనిపోయిన శ్రీనుతో గొడవ పడ్డాడట. నిజమేనా?" అడిగాడు ఎస్సై. ఆ
హోంగార్డును ఎక్కడ చూసినట్లుంది నాకు. ఒకసారి చూస్తే మర్చిపోయే రూపం కాదు.
ఎక్కడో.. ఎప్పుడో.. చూశాను. ఎక్కడ? ఎప్పుడు? " ఏమో సార్. నాకు గుర్తులేదు.
ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు రోడ్డుమీద గెంతుకుంటూ మన జిప్ మీద దబదబా చరిస్తూ వెళ్తుంటే
పిలిచి చీవాట్లు పెట్టారు సార్. అంతే!" అన్నాడు ఆ హోంగార్డ్. అప్పుడు
గుర్తొచ్చింది. ఎస్.. అతని ఇతను. శ్రీను స్నేహితుల వివరాలు కనుక్కోవడానికి
కాలేజీకి వెళ్లేప్పుడు... అక్కడ చూశాను. అమ్మాయిని బైకు మీద తీసుకెళ్తూ మా అందరి
కేసి ఓరగా తల ఎత్తి చూశాడు. అతన్ని నేను గమనించాను. ఎస్.. అతనే..! ఆ వెంటనే ఎస్సై
దగ్గర వీడ్కోలు తీసుకుని విజినిగిరి పాలెం వెళ్లాను. రాజీవ్ ని కలిసి శ్రీను
ఎవరితో స్నేహం గా ఉంటాడో పట్టుబట్టి మళ్లా
నా దగ్గరున్న జాబితాతో సరి చేసుకున్నాను. రాజీవ్ తో పదిహేను మందయ్యారు. అందులో
నలుగురు అమ్మాయిలున్నారు. కాలేజీలో ఆ కుర్రాళ్ళు మగపిల్లల పేర్లు చెప్పారు.
అమ్మాయిల పేరు చెప్పలేదు. అక్కడినుంచి కాలేజీకి వెళ్లాను. పది మంది కుర్రాళ్ళు
నన్ను చూస్తూనే దగ్గరికి వచ్చారు. నలుగురు అమ్మాయిల గురించి ఆరా తీసాను.
సిగ్గుపడుతూ తలలు వంచుకున్నారు. " అమ్మాయిలు కదా. ఎందుకులే అని చెప్పలేదన్నా"
అన్నారు. వాళ్లను కూడా చూపించారు. నా అనుమానం నిజమైంది. అందులో ఒక అమ్మాయి నా
దృష్టిలో పడింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయనుకున్నాను. హోం గార్డ్ ఈ అమ్మాయితోనే
వెళ్లాడని నిర్ధారించుకున్నాను. అక్కడినుంచి క్రైమ్ బ్రాంచ్ ఎస్సై కి ఫోన్ చేసి
విషయం వివరించాను. అంతే! ఆ మరునాడే అన్ని పేపర్లలో శ్రీను ఆక్సిడెంట్లుగా
చనిపోలేదని, ఇది ఓ ప్రీ ప్లాన్ మర్డరని వార్త వచ్చింది. క్రైమ్ ఎస్సేయే స్వయంగా
ప్రెస్ మీట్ లొ చెప్పాడు. చనిపోయిన శ్రీను కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయితో
ప్రేమలో పడ్డాడని.. ఆ అమ్మాయి అన్నే శ్రీనుని జీపుతో గుద్ది చంపేశాడని... అతను
పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పని చేస్తున్న వ్యక్తి అని.. శ్రీను మరణం వెనుక ఉన్న ఈ రహస్యాన్ని ఛేదించడం
లో నరేంద్ర అనే యువకుడు సహకరించాడని వివరించారు.
పోలీస్ కేస్
Reviewed by Smartbyte group
on
August 31, 2018
Rating:

No comments: