" సుష్మా! నేను ఫోరంకి వెళ్ళొస్తాను. మా నాన్నకి బాగా లేదంట. తమ్ముడు ఫోన్ చేశాడు.
వెళ్లి చుాసోస్తాను. సాయంకాలానికి వచ్చేస్తాలే. మీ నాన్నకు మందులు ఇవ్వు అన్నం
తినగానే." అన్నది హైమావతి. " సరే! పిన్ని" అన్నది సుష్మ. హైమావతి
బెడ్ రూం లోకి వెళ్ళింది. నాగభూషణం కళ్ళు మూసుకుని ఉన్నాడు." ఏమండీ!"
అని తట్టి పిలిచింది. నాగభూషణం కళ్ళు తెరిచాడు. " పోరంకి వెళ్ళొస్తాను. మా
నాన్నకి బాగా లేదంట" అన్నది. నాగభూషణం తల ఊపాడు. హైమావతి భవానీపురం నుంచి
విజయవాడ బస్ స్టేషన్ కు వెళ్లే బస్సు ఎక్కింది. అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు
వీర్రాజు. ఒక హోటల్ కి వెళ్లి ఫ్యామిలీ రూమ్ లొ కూర్చున్నారు. " అర్జెంట్
అన్నావు. ఏంటది?" అడిగాడు వీర్రాజు. " ఉండవల్లి లో పొలం అమ్మడానికి బేరం
పెట్టాడు మా ఆయన. ఆ డబ్బుతో కూతురి పెళ్లి చేయాలని ప్లాన్. అది అమ్మేస్తే నాది
అధోగతే. అందుకే నేనొక ప్లాన్ వేశాను." "ప్లానా?" "ఒౌను. రేపు
ఉదయం పది తర్వాత నువ్వు నీ కారు తీసుకురా. క్యాన్సర్ ఆస్పత్రికనీ అయన్ని
తీసుకొస్తాను. దారిలో ఎక్కడో ఒకచోట కారు ఆపి ముఖంమీద దిండు పెట్టి ఊపిరాడకుండా
చేసి చంపేద్దాం. పీడ విరగడ అవుతుంది" చెప్పింది హైమావతి. వీర్రాజు ఆలోచనలో
పడ్డాడు. నాగభూషణం రెండో భార్య హైమావతి. రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాక నాగభూషణం
భార్య చనిపోయింది. హైమావతి ని పెళ్లి చేసుకున్నాడు. వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం
ఉంది. ఆమెకు వీర్రాజు తో అక్రమ సంబంధం ఉంది. వీర్రాజు కి సొంతంగా కారు వుంది. తనే
డ్రైవ్ చేసుకుంటూ టాక్సీలా తిప్పుతుంటాడు. ఉండవల్లి ఊళ్లో నాగభూషణానికి ఎకరం పొలం
ఉంది. అది రాజధానికి దగ్గరగా ఉండడంతో విలువ పెరిగింది. రిటైరైన తర్వాత
నాగభూషణానికి క్యాన్సర్ జబ్బు బయట పడింది. తను పోయే లోపల కూతురు సుష్మా పెళ్లి
గ్రాండ్ గా చేసి అత్తారింటికి పంపేయాలని ఆలోచనలో ఉన్నాడు. కోటి రూపాయల కట్నం అయినా
ఇచ్చి మంచి ఉద్యోగస్తునికి ఇవ్వాలని కోరిక. అందుకు హైమావతి వ్యతిరేకి. పొలం అమ్మడం
ఇష్టం లేదు. బ్యాంకులో ఉన్న డబ్బుతో మామూలు సాదాసీదా సంబంధం చూసి పెళ్లి చేసి
పంపాలని కోరుతోంది. పొలం అమ్మేస్తే ఆయన పోయాక తనకేం మిగులుతుంది? భార్యగా వచ్చే
ఫ్యామిలీ పెన్షన్ తో బతకాలి. " సరే అయితే! ఆస్పత్రికి వెళ్లేటప్పుడు వద్దు.
ముందు ఆస్పత్రికి వెళ్దాం. అక్కడ టెస్టులు అవి చేస్తారు. టైం పడుతుంది. ఆయన అక్కడి
ఉంచి మనం హాయ్ ల్యాండ్ లో గడుపుదాం. సాయంకాలం వెళ్లి ఆయన్ని కారేక్కించుకుని
తిరిగి వచ్చేటప్పుడు ఫినిష్ చేద్దాం. అప్పుడు ఎవరికి అనుమానం రాదు. ఎటు క్యాన్సర్
తో పోయేవాడే అని అందరికీ తెలుసు." అన్నాడు వీర్రాజు. హైమావతి తల ఊపింది.
వీర్రాజు తో అప్పుడప్పుడు హోటళ్లలో గడపడం ఆమెకు మామూలే.
మ్యారేజ్
బ్యూరో నుంచి వచ్చిన ఏజెంటు విక్రమ్ లాప్ టాప్ లో వధువుల కోసం రిజిస్టర్
చేయించుకున్న అబ్బాయిల ఫోటోలు, బయోడేటాలు నాగభూషణానికి చూపిస్తున్నాడు. ఎక్కువగా
అమెరికాలో జాబ్స్ చేస్తున్న వాళ్ళవే ఉన్నాయి. నాగభూషణానికి ఫారిన్ సంబంధం చేయడం
ఇష్టం లేదు. అమెరికా లో ఉద్యోగం చేస్తున్నారని భారీ ఎత్తున కట్నాలు ఇచ్చి కూతురితో
పెళ్లి చేసి మోసపోయిన వార్తలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. కొందరేమో అక్కడ
ఆల్రెడీ ఏ తెల్లమ్మాయినో పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఆ
సంగతి చెప్పరు. ఇక్కడ పేరెంట్స్ ఒత్తిడి చేస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి
కాపురానికి వెళ్ళాక అసలు సంగతి బయటపడి లబోదిబోమన్నారు. ఇంకొందరు యువకులకు
అమెరికాలో ఏ ఉద్యోగం ఉండదు. సాఫ్ట్ వేర్ జాబ్ అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. తీరా
కాపురానికి వెళ్ళాక తెలుస్తుంది, అక్కడ ఏ పెట్రోల్ బంకులోనో, సూపర్ మార్కెట్ లోనో
ఉద్యోగం చేస్తున్నాడని. అందుకే నాగభూషణం ఇండియాలోనే ఉద్యోగం చేస్తున్న సంబంధాలు
చూడమని చెప్పాడు. సుష్మ బీటెక్ చదివింది. తర్వాత అమెరికాలో ఎమ్మెస్
చేయాలనుకుంటుంది. ఆమె స్నేహితురాళ్ళు చాలామంది అమెరికాకు వెళ్లి చదవాలని ప్లాన్
చేసుకుంటున్నారు. కానీ తండ్రికి క్యాన్సర్ అని బయటపడగానే ఆమె ఆశలు నీరుగారిపోయాయి.
మ్యారేజ్ బ్యూరో ఏజెంట్ వెళ్లిపోయిన తర్వాత సుష్మ తండ్రితో చెప్పింది."
నాన్నా! నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. కావాలంటే ఇక్కడే ఎంటెక్ చేస్తాను."
" కాదమ్మా! నువ్వు అమెరికాలో ఎమ్మెస్ చేసినా, ఇక్కడ ఎంటెక్ చేసినా తేడా ఏం
లేదు. కాకపోతే నా పరిస్థితి తెలుసుగా? ఎప్పుడు పోతానో తెలియదు. నేను ఉండగానే నీ
పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే నాకు మనశాంతి గా ఉంటుంది." అన్నాడు
నాగభూషణం.
తండ్రి సంగతి ఆమెకు బాగా తెలుసు. అనుకున్నదే చేస్తాడు. ఎవరి మాటా వినడు.
తల్లి చనిపోయినప్పుడు చాలామంది మళ్లీ ఈ వయసులో పెళ్లెందుకు? వద్దు అన్నారు.ఇరవై
ఏళ్ల చిన్నదాన్ని చేసుకోవడం ఎందుకు? అన్నారు. అయినా ఆయన వినలేదు. హైమావతి తండ్రి
కూడా విధవరాలైన కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాడు. నాగభూషణం పోయినా సొంత ఇల్లు,
పొలం ఉంది, పైగా కూతురికి జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని ఆలోచించి ఇచ్చి
పెళ్లి చేశాడు. ఇప్పుడిక సుష్మా చదువుకి పులిస్టాప్ పెట్టాక తప్పని పరిస్థితిలో
ఉంది. పెళ్లి చేసుకోక తప్పదని ఆమె కి అర్థమైంది. నాగభూషణం సుష్మ పెళ్లి చేయడానికి
తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండటంతో హైమావతి పెళ్లి ఆపడానికి అన్ని రకాలుగా
ఆలోచిస్తుంది. ఎలాగో భర్త తన మాట వినడు. " నువ్వు పెళ్లికి ఒప్పుకోకు. మీ నాన్న
వత్తిడి చేస్తాడు. ఏ సంబంధం నచ్చలేదని చెప్తుండు. ఆయన ఎక్కువ రోజులు బతకడు. ఆ
తర్వాత నువ్వు అమెరికా వెళ్లి చదువుకుంటూ గాని" అని సుష్మకు ఎక్కించింది.
సవతి తల్లికి తన మీద ఎంతో ప్రేమ ఉందని సుష్మ అనుకుంది. అసలు సంగతి అది కాదనే
గ్రహింపు లేదు. అందుకే తనకు పెళ్లి వద్దని తండ్రితో వాదిస్తుంది. కానీ తండ్రి తన
మాటలు లెక్కచేయడని ఆమెకు తెలుసు. జరిగేదే జరుగుతుందని నిర్వేదంలో పడిపోయింది
సుష్మ. అనుకున్నట్లుగానే వీర్రాజు ఉదయం పది గంటలకు భవానీపురం లోని నాగభూషణం ఇంటికి
కారు తీసుకువచ్చాడు. నాగభూషణం అప్పుడు టిఫిన్ చేస్తున్నాడు." వీర్రాజుా!
టిఫిన్ చేద్దువుగాని లోపలికి రా!" అని పిలిచింది హైమావతి. " వద్దండీ!
టిఫిన్ చేసోచ్చాను అమ్మగారుా!" అని వినయం ఒలకపోశాడు వీర్రాజు. తర్వాత
నాగభూషణాన్ని ఎక్కించుకుని కారులో బయలుదేరారు. తాడేపల్లి లో ఉంది. మణిపాల్
క్యాన్సర్ హాస్పిటల్. విజయవాడలో కృష్ణానది మీదున్న కనకదుర్గ వారధి దాటి తాడేపల్లి
కి చేరుకున్నాను. నాగభూషణన్ని ఆస్పత్రిలో
నర్సు కి అప్పగించాను. ఆమె శ్రద్ధగా చూస్తుంది నాగభూషణాన్ని. నాగభూషణం టీచర్ గా
పనిచేస్తున్నప్పుడు నర్సు సునీత ఆయన శిష్యురాలు. అందుకే వచ్చినప్పుడల్లా
ప్రత్యేకంగా ట్రీట్ చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసి టెస్టులు, ట్రీట్
మెంట్ ను శ్రద్ధగా చేస్తుంది. నాగభూషణం శిష్యురాలు అక్కడ ఉండటం హైమావతి కి
వెసులుబాటుగా ఉంది. ఆయన్ని అప్పగించి వీర్రాజు తో ఎంజాయ్ చేయడానికి బయలుదేరింది.
సాయంకాలమైంది.
చీకటి పడింది. హైమావతి తిరిగిరాలేదు. నర్స్ సునీత.. నాగభూషణం దగ్గరున్న సెల్ ఫోన్
నుంచి హైమావతి కి కాల్ చేసింది. రింగవుతుంది కానీ ఆమె లిఫ్ట్ చేయడం లేదు. "
మాస్టారుా! మేడమ్ లిఫ్ట్ చేయడం లేదు" అన్నది సునీత. " ఈ పాటికే రావాలి
కదా?" అన్నాడు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా రింగ్ అవుతుంది కానీ హైమావతి
కాల్ లిఫ్ట్ చేయడం లేదు. " సునీతా! మా అమ్మాయి కి కాల్ చేయ్యి. అసలు ఇంట్లో
నుంచి హైమా బయలుదేరిందో లేదో? అన్నాడు నాగభూషణం. సుష్మ ఫోన్ ఎత్తగానే సునీత ఫోన్
ను నాగభూషణానికి అందించింది. " నాన్నా! ఘోరం జరిగిపోయింది." అన్నది
సుష్మా వణుకుతున్న గొంతుతో. " ఏం జరిగిందమ్మా?" అడిగాడు కూతుర్ని.
" నాన్నా! నందన్ రిసార్ట్స్ వెళ్లేదారిలో వెళ్తున్న కారుకు ఓ బస్సు ఢీ
కొట్టిందట. పిన్ని హ్యాండ్ బ్యాగ్ ని, అందులోని తన ఫోటోను టీవీలో చూపిస్తున్నారు.
పిన్ని స్పాట్ లోనే చనిపోయిందట నాన్నా. శవాన్ని కూడా చూపిస్తున్నారు..!" అని
చెప్పింది సుష్మ. ఎప్పుడుా హాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసే వీర్రాజు, హైమావతి ఈసారి
నందన్ రిసార్ట్స్ లో గడపాలనుకున్నారు. విధి చిన్నచూపు చూసింది. అందుకే అంటారు
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని. నాగభూషణం బిత్తరపోయాడు." అటువైపు ఎందుకు
వెళ్ళింది?" అడిగాడు కూతుర్ని. సుష్మకి మాత్రం ఏం తెలుసు? " ఏమో
నాన్నా!" అన్నది.
ప్లాన్
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: